అహ్మాదాబాద్: భారత్తో జరగనున్న నాలుగవ టెస్టు(Fourth Test)కు ఆస్ట్రేలియా కెప్టెన్సీ బాధ్యతలను స్టీవ్ స్మిత్(Steve Smith) చేపట్టనున్నాడు. మూడవ టెస్టుకు స్మిత్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఆ టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా(Australia) జయభేరి మోగించింది. తల్లి ఆరోగ్యం సరిగా లేని కారణంగా.. తొలి రెండు టెస్టులు ముగియగానే ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ స్వదేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. కమ్మిన్స్ స్థానంలో మూడో టెస్టుకు స్మిత్ను కెప్టెన్గా ప్రకటించారు. అయితే కమ్మిన్స్(Cummins) రాక ఆలస్యం కానున్న నేపథ్యంలో ఫోర్త్ టెస్టుకు కూడా స్మిత్నే కొనసాగించనున్నారు.
Steve Smith is set to continue as captain for the final #INDvAUS Test in the absence of Pat Cummins 👇#WTC23
— ICC (@ICC) March 6, 2023
ఇక అహ్మాదాబాద్ వేదికగా జరగనున్న నాలుగవ టెస్టు తొలి రోజు ఆటను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్(PM Anthony Albanese) వీక్షించనున్నారు. ప్రధాని ఆంథోనీతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కూడా మ్యాచ్ను వీక్షించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
నాలుగు టెస్టుల సిరీస్లో ప్రస్తుతం భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. తొలి రెండు టెస్టుల్లో ఇండియా విజయం సాధించగా.. మూడవ టెస్టులో ఆస్ట్రేలియా విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే.