INDW vs AUSW : ముంబైలోని వాంఖడేలో ఆస్ట్రేలియాతో జరుగతున్న ఏకైక టెస్టులో భారత జట్టు(Team India) గెలుపు వాకిట నిలిచింది. స్పిన్నర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియాను 261 పరుగులకే ఆలౌట్ చేసింది. దాంతో, పరుగులు 75 చేస్తే చారిత్రాత్మక విజయం టీమిండియా ఖాతాలో పడనుంది. తొలి సెషన్లో భారత జట్టు పేసర్లతో బౌలింగ్ దాడి ఆరంభించింది. కొద్ది సేపటికే డేంజరస్ అష్ గార్డ్నర్(7)ను పూజా వస్త్రాకర్ ఎల్బీగా ఔట్ చేసింది.
ఆ తర్వాత స్నేహ్ రానా ఒకే ఓవర్లో సథర్లాండ్(27), అలనా కింగ్(0)ను పెవిలియన్ పంపింది. జెస్ జొనాసెన్(9)ను రాజేశ్వరీ గైక్వాడ్ బౌల్డ్ చేయడంతో కంగారూల ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో స్నేహ్ రానా నాలుగు, రాజేశ్వరీ గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టారు.
Sneh Rana gets the big wicket of Annabel Sutherland and then bowls Alana King first ball! #INDvAUS
▶️ https://t.co/uaFLxAnKj5 pic.twitter.com/R3fQnzLRaA
— ESPNcricinfo (@ESPNcricinfo) December 24, 2023
మూడో రోజైన శనివారం ఆసీస్ను నిలువరిద్దామనుకున్న ఇండియా ఆశలు నెరవేరలేదు. 187 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్కు దిగిన ఆసీస్ ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 376/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 406 పరుగులకు ఆలౌటైంది.
మంధాన(74), దీప్తిశర్మ(78)
ఓవర్నైట్ బ్యాటర్లు దీప్తిశర్మ(78), పూజ వస్త్రాకర్(47) అదే జోరు కొనసాగించలేకపోయారు. 30 పరుగుల వ్యవధిలో టీమ్ఇండియా మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. ఓవరాల్గా టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత్కు ఇదే తొలి ఇన్నింగ్స్ అత్యుత్తమ స్కోరు. ముఖ్యంగా దీప్తి, పూజ ఎనిమిదో వికెట్కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టెస్టుల్లో ఎనిమిదో వికెట్కు భారత్కు ఇదే అత్యుత్తమం కాగా, ఓవరాల్గా రెండో బెస్ట్గా నిలిచింది.