ఆసియా కప్లో ఎవరూ ఊహించని ఫలితం. అండర్ డాగ్గా టోర్నీ ఆరంభించిన శ్రీలంక.. ఫేవరెట్లను చిత్తు చేసి ఆసియా కప్ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్లుగా బరిలో దిగిన భారత్.. సూపర్-4 దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. భారత్ లేకపోవడంతో కచ్చితంగా కప్ పాక్దే అని అంతా భావించారు. దానికితోడు ఫైనల్లో పాకిస్తాన్ టాస్ కూడా గెలిచింది.
దుబాయ్ పిచ్పై ఛేజింగ్ చేసిన జట్టే ఎక్కువగా గెలిచింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డిన శ్రీలంక.. అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆ జట్టు భానుక రాజపక్స (71 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో 170 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ను ఆరంభం నుంచే తడబడింది.
యువపేసర్ ప్రమోద్ మధుశన్ తన తొలి ఓవర్లోనే బాబర్ ఆజమ్ (5), ఫకర్ జమాన్ (0) ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. అయితే మహమ్మద్ రిజ్వాన్ (55), ఇఫ్తికార్ అహ్మద్ (32) ఆ జట్టును నెమ్మదిగా విజయం వైపు తీసుకెళ్లేలా కనిపించారు. కానీ మరోసారి ప్రమోద్ సత్తా చాటి అహ్మద్ను పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే కరుణరత్నే బౌలింగ్లో మహమ్మద్ నవాజ్ (6) కూడా అవుటయ్యాడు.
ఆ తర్వాత ఖుష్దిల్ షా (2), ఆసిఫ్ అలీ (0), షాదాబ్ ఖాన్ (8), నసీం షా (4) ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. చివరి ఓవర్ వేసిన కరుణరత్నే.. చివరి బంతికి హారిస్ రవూఫ్ (13)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది.
శ్రీలంక జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. లంక బౌలర్లలో ప్రమోద్ మధుశన్ నాలుగు వికెట్లతో నిప్పులు చెరగగా.. హసరంగ 3, చమిక కరుణరత్నే 2, తీక్షణ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
It's finally ours! 👊👊🇱🇰
An epic performance from our sensational Lions! Men's #AsiaCup champions! 🏆#RoaringForGlory #SLvPAK pic.twitter.com/w3CeoP5NuJ
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 11, 2022