IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో శుభ్మన్ గిల్(101 నాటౌట్ : 136 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ కొట్టాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో సింగిల్ తీసి శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది భారీ స్కోర్ బాకీ పడిన గిల్.. 132 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో మూడంకెల స్కోర్ సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. టెస్టుల్లో మూడో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.
గత 13 ఇన్నింగ్స్లో నిరాశ పరిచిన గిల్.. జట్టుకు అవసరమైన సమయంలో సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించాడు. మరో ఎండ్లో అక్షర్ పటేల్(33 నాటౌట్) చక్కని సహకారం అందిస్తున్నాడు. లంచ్ టైమ్కు 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసిన రోహిత్ సేన ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 201 రన్స్ కొట్టింది.
𝙃𝙐𝙉𝘿𝙍𝙀𝘿 𝙛𝙤𝙧 𝙎𝙝𝙪𝙗𝙢𝙖𝙣 𝙂𝙞𝙡𝙡! 💯
A glittering knock as he completes his 3rd Test Century 👏👏
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/z33eaw2Pr5
— BCCI (@BCCI) February 4, 2024
ఉప్పల్ టెస్టులో విఫలైమన గిల్.. వైజాగ్ మ్యాచ్లో మునపటి గిల్ను తలపించాడు. 35 పరుగులకే 2 వికెట్లు పడిన దశలో.. ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్న గిల్ ఏ ఒక్క చెత్త షాట్ ఆడలేదు. రెండుసార్లు ఎల్బీ అప్పీల్ తప్పించుకున్న అతడు మూడో వికెట్కు శ్రేయస్ అయ్యర్(29)తో 81 పరుగులు జోడించాడు.
అయితే.. ఆ తర్వాతి ఓవర్లోనే టామ్ హర్ట్లే బౌలింగ్లో అయ్యర్ భారీ షాట్ ఆడగా.. బెన్ స్టోక్స్ పరుగెత్తుతూ వెళ్లి డైవింగ్ క్యాచ్ పట్టాడు. దాంతో, ఇండియా 111 రన్స్ వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ (9) కుదురుకున్నట్టే కనిపించినా.. రెహాన్ అహ్మద్ బౌలింగ్లో కీపర్ చేతికి చిక్కాడు. అనంతరం అక్షర్ పటేల్, గిల్ ఐదో వికెట్కు 81 పరుగులు జోడించారు.