ISI Agent Arrest : మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న పాక్ ఐఎస్ఐ ఏజెంట్ను యూపీ ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. సత్యేంద్ర సివల్ 2021 నుంచి మాస్కోలో ఇండియన్ ఎంబసీలో పనిచేస్తున్నాడు. యూపీలోని హపూర్కు చెందిన సత్యేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖలో ఎంటీఎస్ (మల్టీ టాస్కింగ్, స్టాఫ్)గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో గూఢచర్యం ఆపరేషన్ జరుగుతున్నదని ఏటీఎస్కు సమాచారం రావడంతో యూపీ ఏటీఎస్ సివల్ను ప్రశ్నించింది. ఏటీఎస్ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని సివల్ ఆపై స్పై ఆపరేషన్ చేసినట్టు అంగీకరించడంతో మీరట్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
భారత ప్రభుత్వ అధికారులను ప్రలోభాలకు గురిచేసి వారి నుంచి భారత సైన్యం, దైనందిన కార్యకలాపాల గురించి సమాచారం రాబట్టినట్టు దర్యాప్తులో సత్యేంద్ర సివల్ అంగీకరించాడు. భారత రాయబార కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన కీలక, రహస్య సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేసినట్టు దర్యాప్తులో గుర్తించారు.
Read More :
Arvind Kejriwal | కేజ్రీవాల్ మా నోటీసులను లెక్కచేయడం లేదు.. ఢిల్లీ కోర్టులో ఈడీ ఫిర్యాదు