న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభంకానున్న రెండో టెస్టుకు కూడా శ్రేయాస్ అయ్యర్ దూరంకానున్నాడు. నడుము నొప్పితో బాధపడుతున్న అతను తొలి టెస్టుకు కూడా దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను బెంగూళురులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేట్ అవుతున్నాడు. ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లా స్టేడియంలో రెండో టెస్టు జరగనున్నది. ట్రైనర్ ఎస్ రజినీకాంత్ శిక్షణలో రిహాబ్ ప్రోగ్రామ్కు చెందిన కొన్ని వీడియోలను అయ్యర్ ఇటీవల పోస్టు చేశాడు. కొన్ని స్వదేశీ మ్యాచ్లు ఆడిన తర్వాతే అయ్యర్ను మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇరానీ కప్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టులో అయ్యర్కు చోటు కల్పించే ఛాన్సు ఉన్నట్లు కనిపిస్తోంది. మార్చి ఒకటో తేదీ నుంచి మధ్యప్రదేశ్తో రెస్ట్ ఆఫ్ ఇండియా తలపడనున్నది. అయితే ఇటీవల జడేజా కూడా బ్రేక్ తర్వాత ఫిట్నెస్ టెస్ట్లో భాగంగా తమిళనాడుతో రంజీ మ్యాచ్ ఆడాడు. అదే తరహాలోనూ అయ్యర్కు డొమెస్టిక్ మ్యాచ్ ఆడే అవకాశాన్ని ఇవ్వనున్నారు.
నాలుగు టెస్టు మ్యాచ్ల తర్వాత ఆసీస్ తో జరిగే వన్డే టోర్నీకి బుమ్రాను తీసుకునే అవకాశాలు కనిపించడంలేదు. ప్రస్తుతం స్ట్రెస్లో ఉన్న బుమ్రాను తొందరపడి వన్డేల్లో ఆడించడానికి సెలెక్టర్లు ఆసక్తిగా లేరు. లండన్లో జూన్లో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు బుమ్రాను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి ముందు అతను ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.