IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో టైటిల్ కొల్లగొట్టడం కోసం పలు ఫ్రాంచైజీలు భారీ కసరత్తులే చేస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరు, లక్నో జట్లు హెడ్కోచ్, కెప్టెన్లను మార్చగా.. కొన్ని జట్లు కొత్త కెప్టెన్లను నియమిస్తున్నాయి. ఇప్పటికే 17వ సీజన్లో రిషభ్ పంత్(Rishabh Pant) ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా బరిలోకి దిగుతాడని ఢిల్లీ తేల్చి చెప్పింది.
తాజాగా కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) కూడా కెప్టెన్ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. 16వ సీజన్లో జట్టును అద్భుతంగా నడిపించిన నితీశ్ రానా(Nitish Rana)కు ఝలక్ ఇస్తూ.. రెగ్యులర్ సారథి శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)కు పగ్గాలు అప్పగించింది. అయ్యర్కు మళ్లీ కెప్టెన్సీ అప్పగిస్తున్న విషయాన్ని కోల్కతా మేనేజ్మెంట్ స్వయంగా వెల్లడించింది.16వ సీజన్లో జట్టును అద్భుతంగా నడిపించిన రానాకు వైస్ కెప్టెన్సీ అప్పగించింది.
Quick Update 👇#IPL2024 @VenkyMysore @ShreyasIyer15 @NitishRana_27 pic.twitter.com/JRBJ5aEHRO
— KolkataKnightRiders (@KKRiders) December 14, 2023
16వ సీజన్లో రానా 14 ఇన్నింగ్స్ల్లో రెండు హాఫ్ సెంచరీలతో 413 రన్స్ కొట్టాడు. అయితే.. కీలక మ్యాచుల్లో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్ విఫలం కావడం ఆ జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసింది. దాంతో, రానా నేతృత్వంలోని కోల్కతా 7వ స్థానంతో సరిపెట్టుకుంది.
శ్రేయస్ అయ్యర్
ఈ ఏడాది ఆరంభంలో వెన్నెముక గాయంతో బాధపడిన శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్తో పాటు పలు టోర్నీలకు దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకున్న అతడు ఫిట్నెస్ సాధించి.. ఆసియా కప్(Asia Cup 2023)తో రీ ఎంట్రీ ఇచ్చాడు. పాకిస్థాన్పై శతకంతో చెలరేగిన ఈ రైట్ హ్యాండర్.. అనంతరం స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్లో నాలుగో స్థానంలో విలువైన ఇన్నింగ్స్లు ఆడాడు. దాంతో, పూర్తి ఫిట్గా ఉన్న అయ్యర్కే మళ్లీ పగ్గాలు అప్పగించాలని కోల్కతా మేనేజ్మెంట్ నిర్ణయించింది.