Shoaib Akhtar | టీ20 ప్రపంచ కప్లో ఆదివారం నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా 16 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ పై విజయం సాధించి సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. దీంతో టీ20 నుంచి నిష్ర్కమిస్తుందేమో అన్న స్థితిలో ఉన్న పాకిస్థాన్ అనూహ్యంగా సెమీస్లో అడుగుపెట్టింది. ఒకవేళ నెదర్లాండ్స్పై దక్షిణాఫ్రికా గెలిచి ఉంటే పాకిస్థాన్ ఇంటికి వెళ్లేది. దీంతో పాకిస్థాన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టుకు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కృతజ్ఞతలు తెలిపారు. నెదర్లాండ్స్తో మ్యాచ్లో ఓడి తమకు సెమీస్కు చేరే అవకాశాలను బలపరిచారంటూ కృతజ్ఞతలు తెలిపారు. తమ చిరకాల ప్రత్యర్థితో మరోసారి తలబడే అవకాశం కల్పించారంటూ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు బంగ్లాతో పాక్ మ్యాచ్కు ముందు ఓ వీడియో సందేశాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు షోయబ్. ‘ఇప్పుడే లేచాను. థ్యాంక్యూ సౌతాఫ్రికా. ఎందుకంటే పాకిస్థాన్కు మీరు మరో అవకాశం ఇచ్చారు. జింబాబ్వేతో ఓటమి తర్వాత సెమీ ఫైనల్స్కు పాక్ దాదాపుగా దూరమైంది. చాలాపెద్ద ఫేవర్ చేశారు. వరల్డ్ కప్లో మేం టీమిండియాతో మరోసారి తలపడాలనుకుంటున్నాం. ఇక పాకిస్థాన్ చేయాల్సింది మ్యాచ్ గెలవడమే’ అని తెలిపారు.
What a tournament. No team was at their absolute best, that made the tournament the best.
A World Cup to remember. pic.twitter.com/54TRquTtGy— Shoaib Akhtar (@shoaib100mph) November 6, 2022