Shivam Dube : ఐపీఎల్ 16వ సీజన్లో సిక్సర్ల మోత మోగించిన శివం దూబే(Shivam Dube) టీమిండియా ఫినిషర్గా సూపర్ హిట్టయ్యాడు. అఫ్గనిస్థాన్తో మొహాలీలో జరిగిన తొలి టీ20లో ఈ లెఫ్ట్హ్యాండర్ సుడిగాలి ఇన్నింగ్స్తో చెలరేగాడు. రింకూ సింగ్(Rinku Singh)తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
దాంతో ఈ యువ బ్యాటర్పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియాకు మరో ఫినిషర్ దొరికాడంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే.. మ్యాచ్ అనంతరం మాట్లాడిన దూబే.. మ్యాచ్లు ముగించడం ఎలాగో మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)ని చూసి నేర్చుకున్నానని అన్నాడు.
Acing the chase 😎
Conversations with Captain @ImRo45 👌
Message for a special bunch 🤗Hear from the all-rounder & Player of the Match of the #INDvAFG T20I opener – @IamShivamDube 👌👌 – By @ameyatilak
WATCH 🎥🔽 #TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/edEH8H3O5f
— BCCI (@BCCI) January 12, 2024
‘మంచి అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. చాన్స్ను మిస్ చేసుకోవద్దని మనసులో అనుకున్నా. క్రీజులోకి వచ్చాక ఇక మ్యాచ్ను ముగించే వెళ్లాలని డిసైడయ్యా. ఫినిషర్గా మ్యాచ్లు గెలిపించడం ఎలాగో మహీ భాయ్ని చూసి నేర్చుకున్నా. ధోనీ స్ఫూర్తితోనే ఈరోజు సక్సెస్ అయ్యా’ అని దూబే జియో సినిమాతో తెలిపాడు.
శివం దూబే, మహేంద్ర సింగ్ ధోనీ
అంతేకాదు ఐపీఎల్ 16వ సీజన్లోలో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన శివం దూబే ధోనీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘నేను ప్రతిసారి మహీభాయ్తో మాట్లాడేవాణ్ణి. అతడి ఆటను గమనించేవాణ్ణి. ఆటలో మార్పుల గురించి ధోనీ నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. అతడు ఎల్లప్పుడూ నా ఆటకు రేటింగ్స్ ఇస్తుంటాడు. మహీభాయ్ స్ఫూర్తితో నేను మరింత మెరుగయ్యాను. అందుకు నా ఆత్మవిశ్వాసం కూడా తోడైంది’ అని దూబే వెల్లడించాడు. తొలి టీ20లో అఫ్గనిస్థాన్159 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 72కే ముడు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో వచ్చిన దూబే వీరంగమాడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దాంతో రోహిత్ సేన 17.3 ఓవర్లలోనే గెలుపొందింది.