Shikhar Dhawan : భారత జట్టులో చోటు కోల్పోయిన వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) . ఐపీఎల్ 17వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నాడు. మైదానంలో ఎంతో హుషారుగా ఉండే ధావన్.. భార్య అయేషా ముఖర్జీ(Aeyesha Mukerji)తో విడాకుల కారణంగా కొడుకు జొరావర్ (Zoravar)కు దూరంగా ఉండాల్సి రావడంతో లోలోపలే కుమిలిపోతున్నాడు. తాజాగా హ్యూమన్స్ ఆఫ్ బాంబే (Humans Of Bombay)తో ఈ స్టార్ ఓపెనర్ తన మనసులోని ఆవేదనను వెల్లగక్కాడు.
విడాకుల అనంతరం తన జీవితం ఎలా మారిందో వివరించిన అతడు కొడుకు జొరావర్తో మాట్లాడి ఐదు అరు నెలలు దాటిందని చెప్పాడు. ‘ఒకవారం రోజులు నా కొడుకుని చూడడం కోసం ఆస్ట్రేలియా వెళితే.. కొన్ని గంటలు మాత్రమే అతడిని కలిసే చాన్స్ ఉండేది. నా బిడ్డతో కాసేపు సరదాగా గడపాలని, అతడిని నిద్రపుచ్చాలని, గట్టిగా హత్తుకోవాలని నాకు ఉంటుంది.
అతడికి అవసరమైన తండ్రి ప్రేమను ఇవ్వాలని అనిపిస్తుంది. కానీ, గత ఐదు, ఆరు నెలల్లో ఒక్కసారి కూడా వాడితో మాట్లాడలేదు. అయినాసరే నేను పాజిటివ్గానే ఉన్నా. నా కుమారుడిని ప్రేమిస్తూనే ఉన్నా. అతడు సంతోషంగా ఉండాలి. దేవుడు కరుణిస్తే..ఏదో ఒకరోజు మా అబ్బాయి నాతో కలిసి ఉంటాడు’ అని ధావన్ వెల్లడించాడు.
ధావన్, అయేషాలు 2012 అక్టోబర్లో పెండ్లి చేసుకున్నారు. అప్పటికే ఆమెకు మొదటి భర్తతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2021లో అయేషా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధావన్తో విడాకుల విషయాన్ని వెల్లడించింది. ఈమధ్యే ఫ్యామిలీ కోర్టు ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం అయేషా ఆస్ట్రేలియాలో ఉంటోంది. జొరావర్ కూడా ఆమెతో పాటు అక్కడే ఉంటున్నాడు. డైవొర్స్ తర్వాత కూడా కొడుకును కలిసేందుకు, అతడితో వీడియో కాల్స్ మాట్లాడేందుకు ధావన్కు కోర్టు అనుమతిచ్చింది. అయినా అతడు జోరావర్తో కాసేపు గడపాలని ఎంత ప్రయత్నించినా అయేషా ఏదో విధంగా అడ్డుపడుతూ వస్తోంది.
జొరావర్, ధావన్, అయేషా,
భారత గొప్ప ఓపెనర్లలో ఒకడైన ధావన్ 2022లో టీమిండియా తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. 38 ఏండ్ల ధావన్ ప్రస్తతం ఐపీఎల్లో మాత్రామే ఆడుతున్నాడు. నిరుడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఆకట్టుకున్న గబ్బర్.. 17వ సీజన్లో పరుగుల వరద పారించేందుకు సిద్ధమవుతున్నాడు.