హైదరాబాద్ : రాష్ట్రంలో గంజాయి చాక్లెట్లు( (Ganja Chocolates) కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఉదంతం మరవక ముందే.. తాజాగా ఖమ్మం(Khammam)లో గంజాయి చాకెట్లు లభించడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఖమ్మంలో నిందితుల నుంచి మూడు కిలోల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హైదరాబాద్ శివార్లలోని నార్సింగిలో గంజాయి చాకెట్లు కలకలం సృష్టించాయి. నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట(Kokapet) ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఒడిశాకు చెందిన సౌమ్యా రాజన్గా గుర్తించారు.
అతని నుంచి 40 గంజాయి ప్యాకెట్లను సాధీనం చేసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులకు చాక్లెట్లను అమ్ముతుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తు చేస్తున్నామని చెప్పారు. వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే విషయమై ఆరాతీస్తున్నారు.