Shardul Thakur | భారత క్రికెట్ అభిమానులు ‘లార్డ్’ అని పిలుచుకునే శార్దూల్ ఠాకూర్ రంజీట్రోఫీ సెమీస్లో అదరగొట్టాడు. రంజీ సెమీఫైనల్స్లో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న కీలక పోరులో ముంబై తరఫున ఆడుతున్న శార్దూల్.. సెంచరీతో చెలరేగాడు. శార్దూల్ దూకుడుతో తొలి ఇన్నింగ్స్లో ముంబై భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. సెమీస్లో ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్.. 58 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేయగా 88 బంతుల్లోనే మూడంకెల స్కోరుకు చేరుకున్నాడు. 105 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. శార్దూల్కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం.
తమిళనాడుతో జరుగుతున్న సెమీస్లో భాగంగా తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టును 146 పరుగులకే ఆలౌట్ చేసిన ముంబై ఆ తర్వాత బ్యాటింగ్లో తడబడింది. 106 పరుగులకే ఆ జట్టు ఏడు వికెట్లు కోల్పోయింది. అజింక్యా రహానే, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్లు దారుణంగా విఫలమయ్యారు. యువ ఆటగాడు ముషీర్ ఖాన్ అర్థ సెంచరీ (55)తో రాణించినా అతడు ఎక్కువసేపు నిలువలేకపోయాడు. తమిళనాడు కెప్టెన్ సాయికిషోర్ ఫైఫర్తో ముంబై బ్యాటింగ్ లైనప్ గజగజ వణికింది.
Shardul Thakur gets to his century in style 🔥🔥
What a time to score your maiden first-class 💯
The celebrations say it all 👌👌@imShard | @IDFCFIRSTBank | #RanjiTrophy | #MUMvTN | #SF2
Follow the match ▶️ https://t.co/9tosMLk9TT pic.twitter.com/3RI9Sap6DO
— BCCI Domestic (@BCCIdomestic) March 3, 2024
106 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన శార్దూల్.. బౌండరీలు, సిక్సర్లతో తమిళనాడు బౌలర్లను బెంబేలెత్తించాడు. 88 బంతుల్లో సెంచరీ చేసిన శార్దూల్.. ఆఖరికి కుల్దీప్ సేన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. తనుష్ కొటియాన్ అండతో శార్దూల్ ముంబై స్కోరును 300 మైలురాయిని దాటించాడు. రెండో రోజు మూడో సెషన్లో 88 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ముంబై.. 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. క్వార్టర్స్లో సెంచరీలు చేసిన పది, పదకొండో నెంబర్ బ్యాటర్లు తనూష్ కొటియాన్, తుషార్ దేశ్పాండేలు ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ముంబై ఆధిక్యం 156 పరుగులుగా ఉంది.