ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యే దివాకర్రావు
మంచిర్యాల, కోటపల్లిలో శతజయంతి వేడుకలు
ఘనంగా నివాళులర్పించిన నేతలు
మంచిర్యాల ఏసీసీ/కోటపల్లి, జూన్ 28 :పీవీ ప్రపంచ స్థాయి నాయకుడని, ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని రిమ్స్ డిగ్రీ కళాశాల, కోటపల్లిలో పీవీ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీవీ రచనలను వెలుగులోకి తెచ్చిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదేనని స్పష్టం చేశారు.
మంచిర్యాల ఏసీసీ, జూన్ 28 : పీవీ సేవ లు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ పురా ణం సతీశ్, ఎమ్మెల్యే దివాకర్ రావు అ న్నారు. జిల్లాకేంద్రంలోని రిమ్స్ డిగ్రీ కళాశాలలో పీవీ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హాజరై పీవీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ పీవీ ప్రపంచ స్థాయి నాయకుడని కొనియాడారు. అనంతరం బ్రాహ్మణసంఘం అధ్యక్షుడు కొమ్మెర భాస్కర్ మాట్లాడుతూ మంచిర్యాల డిగ్రీ కళాశాల ఎదుట చౌరస్తాను పీవీ చౌక్గా ఏర్పాటు చేసి విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ స్పందించి తనవంతుగా రూ. 2 లక్షలు, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్గౌడ్ రూ. లక్ష, మాజీ మున్సిపల్ చైర్మన్ వసుంధర రమే శ్ రూ. లక్ష ఇస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్టె భూమేశ్, రిమ్స్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ కృష్ణకుమార్, ప్రిన్సిపాల్ దామోదర్ రెడ్డి, డైరెక్టర్లు రామ్మోహన్, రమణ, మల్లేశ్, మ హేందర్ రెడ్డి, కళాధర్ రెడ్డి, బ్రాహ్మణసంఘం సభ్యులు రమేశ్, మంగారావు, శిల్ప పాల్గొన్నారు.
కోటపల్లిలో..
కోటపల్లి, జూన్ 28 : మండలకేంద్రంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీవీ ఆయన రచనలను వెలుగులోకి తెచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వనిదేనని అన్నారు. సీఎం కేసీఆర్ పీవీ సేవలను గుర్తించి ఆయన శత జయంతి ఉత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా ఘనం గా నిర్వహించడంతో పాటు పీవీ కుమార్తె సురభీవాణికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఎంపీపీ మంత్రి సురేఖ, ఎంపీడీవో కే భాస్కర్, సూపరింటెండెం ట్ లక్ష్మయ్య, పీఏసీఏఎస్ చైర్మన్ పెద్దపో లు సాంబాగౌడ్, ఎంపీటీసీ చంద్రగిరి శం కరయ్య, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షు డు భైస ప్రభాకర్, మండల నాయకులు మంత్రి రా మయ్య, పుప్పిరెడ్డి రాంరెడ్డి, మంత్రి రామయ్య, మోడెం గట్టాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.