ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
104 మంది లబ్ధిదారులకు రూ.1.04 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ
జన్నారం. ఏప్రిల్ 7: పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి పథకం వరంలా పనిచే స్తున్నదని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన 104 మందికి మంజూరైన రూ. కోటీ 4 లక్షల 12 వేల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను బుధవారం ఎమ్మె ల్యే రేఖానాయక్ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల కు చెందిన ఆడబిడ్డలను ముఖ్యమంత్రి కేసీఆ ర్ ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. అనంత రం ధర్మారానికి చెందిన టీఆర్ఎస్ నాయకు డు వొల్లాల నర్సాగౌడ్ తల్లి మరణించడంతో, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తహసీల్దార్ పుష్పలత, ఎంపీపీ మాదాడి సరోజన, వైస్ ఎంపీపీ సుతారి వినయ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, వైస్ చైర్మన్ భరత్ కుమార్, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్అలీఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీశ్, సుశీల పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.15లక్షల కేసులు
కేరళలో పోలింగ్ బూత్ ఏజెంట్ హత్య