ఊట్కూర్, మే 16 : లాక్డౌన్ సమయంలో కొవిడ్ నిబంధనలు పా టించి ఆరోగ్యం కాపాడుకోవాలని సర్పంచ్ సావిత్రమ్మ అన్నారు. ఆదివారం మండలంలోని బిజ్వారంలో సర్పంచ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, గ్రామ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ప్రజల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దకే వచ్చి మెడికల్ కిట్లు అందజేయనున్నట్లు తెలిపారు. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లవద్దని, మాస్కు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అంజమ్మ, వార్డు సభ్యులు రాజు, వెంకట్రెడ్డి, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.