న్యూఢిల్లీ : టీమ్ఇండియా యువ క్రికెటర్ సాయిసుదర్శన్ గాయపడ్డాడు. విజయ్ హజారే టోర్నీలో భాగంగా మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు బ్యాటర్ సుదర్శన్ పక్కటెముకలకు గాయమైంది. పరుగు తీసే సమయంలో డైవ్ చేయడంతో ఎముకలో చీలిక వచ్చినట్లు తెలిసింది.
ఈ కారణంగా సుదర్శన్ ఆరు వారాల పాటు క్రికెట్కు దూరం కానున్నట్లు బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గాయంతో రంజీ సీజన్ మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్న ఈ 24 ఏండ్ల క్రికెటర్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ టీమ్కు అందుబాటులోకి రానున్నాడు. ప్రస్తుతం సీవోఈలో పునరావాసం పొందుతున్న సుదర్శన్ త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధించనున్నాడు.