హెడ్డింగ్లీ: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడవ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇండియాకు బ్రేక్ దొరికింది. ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ ఔటయ్యాడు. షమీ బౌలింగ్లో అతను క్లీన్ బౌల్డయ్యాడు. బర్న్స్ 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. 120 స్కోర్ వద్ద రెండవ రోజు ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లండ్.. మరో 15 రన్స్ జోడించి బర్న్స్ వికెట్ను కోల్పోయింది. తొలి కెవిట్కు హమీద్, బర్న్స్లు 135 రన్స్ జోడించారు. హమీద్ 67 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు. ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 78 రన్స్కే ఆలౌటైన విషయం తెలిసిందే.