India vs Bangladesh | రెండో వన్డేలో భాగంగా టీమిండియాతో జరిగిన ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ విజయం సాధించింది. బౌలింగ్తో కట్టుదిట్టం చేయడంతో బంగ్లా టీమిండియాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది.
తొలుత టాస్ గెలిచి బరిలోకి దిగిన బంగ్లాదేశ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. టీమిండియా బౌలింగ్ ధాటికి టాప్ ఆర్డర్లు విఫలమయ్యారు. 19 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 69 పరుగులకే పరిమితమైంది. వంద పరుగుల్లోపే బంగ్లా ఆలౌట్ అవుతుందేమోనని అనుకున్న తరుణంలో లోయర్ ఆర్డర్లు చెలరేగి ఆడారు. మెహిదీ హసన్ (100), మహముదుల్లా (77) దూకుడుగా ఆడారు. ఏడో వికెట్కు 148 పరుగులు జోడించారు. మహముదుల్లా ఔటయ్యాక వచ్చిన నసుమ్ అహ్మద్ కూడా ధాటిగా ఆడాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.
ఇక 272 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్కు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి లక్ష్యాన్ని చేధించలేకపోయింది.
272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆదిలోనే భారీ షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ 5 పరుగులు చేసి ఔటయ్యాడు. 13 పరుగుల వద్ద ధావన్(8) పెవిలియన్కు చేరాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ 11 పరుగులతో సరిపెట్టుకున్నాడు. రాహుల్ 14 పరుగులతో పెవిలియన్కు చేరగా, అయ్యర్ 82, అక్షర పటేల్ 56 పరుగులతో చెలరేగి ఔటయ్యారు. రోహిత్ శర్మ 4 సిక్స్లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ 7, దీపక్ చాహార్ 11, మహ్మాద్ సిరాజ్ 2 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.