Rohit Sharma | రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో ముగిసిన మూడో టెస్టులో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు.. ప్రత్యర్థిపై 434 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. భారత క్రికెట్ చరిత్రలో టెస్టులలో పరుగులపరంగా ఇదే అతిపెద్ద విజయం. కోహ్లీ, షమీ, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఛతేశ్వర్ పుజారా వంటి సీనియర్లు లేకున్నా కుర్రాళ్లతోనే రోహిత్ శర్మ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ గెలుపుతో రోహత్.. భారత్ తరఫున అత్యధిక విజయాల శాతం కలిగి ఉన్న సారథిగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనితో పాటు అగ్రెసివ్ కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్కు సారథ్యం వహిస్తూ అత్యధిక విజయాల శాతం కలిగిన సారథిగా రికార్డులకెక్కాడు.
అంతర్జాతీయ స్థాయిలో ధోని.. భారత జట్టును 2007 నుంచి 2018 దాకా మూడు ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచ్లలో సారథిగా వ్యవహరించాడు. ఇందులో 178 మ్యాచ్లలో గెలిచి 120 మ్యాచ్లలో ఓడిపోయాడు. ధోని విజయాల శాతం 53.61గా ఉంది. ఇక ధోని వారసుడిగా 2013లో భారత జట్టు పగ్గాలు (టెస్టులలో) చేపట్టిన కోహ్లీ.. 2022 దాకా 213 మ్యాచ్లకు కెప్టెన్గా ఉన్నాడు. ఇందులో 135 మ్యాచ్లు గెలిచి 60 మ్యాచ్లు ఓడాడు. కోహ్లీ విన్నింగ్ పర్సంటేజీ 63.38గా ఉంది.
2017 నుంచి కోహ్లీ గైర్హాజరీలో అడపాదడపాగా సారథిగా నిర్వర్తించినా 2022 నుంచి ఆ బాధ్యతలను పూర్తిస్థాయిలో చేపట్టాడు రోహిత్. నిన్న రాజ్కోట్ వేదికగా ముగిసిన టెస్టుతో కలిసి ఇప్పటివరకూ 113 మ్యాచ్లలో కెప్టెన్గా ఉన్న హిట్మ్యాన్ ఖాతాలో 83 విజయాలున్నాయి. రోహిత్ కెప్టెన్సీలో భారత్ 26 మ్యాచ్లు ఓడిపోయింది. రోహిత్ విజయాల శాతం 73.45గా ఉంది.
Rohit Sharma as Captain for India:
Matches – 113
Wins – 83
Lost – 26
Win% – 73.45%– The Hitman has the best winning percentage as Captain in International cricket history…!!!! 🙌 pic.twitter.com/R2Bch8J0Pm
— CricketMAN2 (@ImTanujSingh) February 19, 2024
భారత క్రికెట్ చరిత్రలో విజయాల శాతం 50కి ఎక్కువగా ఉన్న ముగ్గురు క్రికెటర్లలో ధోని, కోహ్లీ తర్వాత రోహిత్ నిలిచాడు. అయితే ధోని, కోహ్లీలు 65% లోపే ఆగిపోగా రోహిత్ ఏకంగా 70 శాతాన్ని అధిగమించడం గమనార్హం. భారత్కు మూడు ఫార్మాట్లలో అత్యద్భుత విజయాలు అందించిన ఈ ముగ్గురు సారథులలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన సారథి మాత్రం మహేంద్రుడు ఒక్కడే. ధోని 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాడు. కోహ్లీ, రోహిత్లు సారథులుగా ఆ ఘనతను ఇంకా అందుకోలేదు.