చెంగ్డూ: ప్రతిష్టాత్మక ఊబర్ కప్ గ్రూప్ దశలో కెనడా, సింగపూర్ను మట్టికరిపించి క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత యువ షట్లర్లు పటిష్టమైన చైనాతో పోరులో మాత్రం చేతులెత్తేశారు. మంగళవారం జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్లో భారత్.. 0-5 తేడాతో చైనా చేతిలో అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. ఇదివరకే క్వార్టర్స్ బెర్త్ ఖాయమైన ఈ టోర్నీలో భాగంగా చైనాతో పోరులో అష్మిత చాలిహా బరిలోకి దిగలేదు.
సింగిల్స్లో ఇష్రాణి బరుహా 12-21, 10-21 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యు ఫీ చేతిలో చిత్తయ్యింది. అన్మోల్ 9-21 ఒక సెట్ ముగియగానే కాలి గాయంతో వెనుదిరిగింది. తన్వీ శర్మను 7-21, 16-21 తేడాతో వాంగ్ జి యి ఓడించింది. డబుల్స్లో ప్రియ-శృతి ద్వయాన్ని 13-21, 12-21 తేడాతో వరల్డ్ చాంపియన్స్ చెన్ కింగ్-జియా యి ఫాన్ జంట ఓడించింది.