శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రాక్స్టార్ రవీంద్ర జడేజా 175 పరుగులతో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీనిపై చాలా మంది విమర్శలు గుప్పించారు. మరొక ఐదు ఓవర్లు ఇచ్చి ఉంటే.. జడ్డూ భాయ్ తొలి డబుల్ సెంచరీ చేసేవాడు కదా అంటూ రోహిత్ను తిట్టిపోశారు.
అయితే అది జట్టు నిర్ణయమని జడేజా వివరణ ఇచ్చాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత దీనిపై రోహిత్ శర్మ నోరువిప్పాడు. ‘‘ఈ మ్యాచ్లో హైలైట్ జడేజానే. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలా వద్దా? అనేది జట్టు నిర్ణయం. జడేజా నిర్ణయం కూడా. ఆ నిర్ణయం అతను జట్టు కోసం ఎంత ఆలోచిస్తున్నాడో చెప్తుంది’’ అన్నాడు.
ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగస్తుందని తాను అసలు ఊహించలేదన్నాడీ కొత్త కెప్టెన్. మొహాలీ మంచి బ్యాటింగ్ పిచ్ అని, కొంచెం టర్న్ ఉన్నా కూడా సీమర్లకు కూడా సహకారం లభించిందని చెప్పాడు. శ్రీలంక బ్యాటర్లకు అసలు అవకాశమే ఇవ్వలేదని బౌలర్లను మెచ్చుకున్నాడు.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏@ImRo45 begins his Test captaincy stint with a win as #TeamIndia beat Sri Lanka by an innings & 2⃣2⃣2⃣ runs in the first @Paytm #INDvSL Test in Mohali. 👌 👌
Scorecard ▶️ https://t.co/XaUgOQVg3O pic.twitter.com/P8HkQSgym3
— BCCI (@BCCI) March 6, 2022