Rohit Sharma : ఇంగ్లండ్పై సూపర్ సెంచరీ కొట్టిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టుకు దూరమయ్యాడు. వెన్నునొప్పి(Stiff Back)తో బాధపడుతున్న హిట్మ్యాన్ ధర్మశాలలో మూడో రోజు ఫీల్డింగ్కు రాలేదు. దాంతో, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jaspirt Bumrah) టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు. రోహిత్ గాయంపై బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘వెన్ను నొప్పి కారణంగా రోహిత్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు మూడో రోజు మైదానంలోకి దిగలేదు’ అని బీసీసీఐ తెలిపింది. ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో రోహిత్ ఒకరోజు మైదానంలోకి రాకపోవడం ఇదే మొదటిసారి.
UPDATE: Captain Rohit Sharma has not taken the field on Day 3 due to a stiff back.#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) March 9, 2024
ధర్మశాలలో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్మన్ గిల్తో కలిసి ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ శతకం బాదాడు. తద్వారా అతడు సుదీర్ఘ ఫార్మాట్లో 12వ శతకం నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 48వ సారి మూడంకెల స్కోర్ నమోదు చేసిన హిట్మ్యాన్ విండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ చేశాడు.
ఈ మ్యాచ్లో 103 పరుగులకు ఔటైన రోహిత్.. ఓపెనర్గా అత్యధిక సెంచరీలు బాదిన మూడో క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్, భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్లు మాత్రమే రోహిత్ కంటే ముందున్నారు.