Hyderabad | హైదరాబాద్ : జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బాలిక తల్లి తన భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత చంద్రశేఖర్ అలియాస్ సిద్ధూతో సహజీవనం చేస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉండగా, వారు తండ్రి వద్దే ఉంటున్నారు. అయితే గతేడాది దసరా పండుగకు బాలిక తల్లి వద్దకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉన్న బాలికపై సిద్ధూ పలుమార్లు అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దసరా నుంచి వేధింపులు సాగుతుండటంతో తాళలేక బాధిత బాలిక తన తల్లికి చెప్పింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సిద్ధూపై పోక్సో కేసు నమోదు చేశారు.