ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్భుతంగా ఆడి విజయం సాధించింది. తొలుత బుమ్రా విజృంభించడంతో 110 పరుగులకే ఇంగ్లండ్ జట్టు కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో చెలరేగి జట్టుకు విజయాన్నందించాడు. అయితే అతను కొట్టిన ఒక సిక్సర్.. ప్రేక్షకుల్లో ఉన్న ఒక ఆరేళ్ల పాపకు తగిలింది.
డేవిడ్ విల్లే వేసిన ఐదో ఓవర్లో రోహిత్ భారీ సిక్సర్ బాదాడు. ఈ బంతిని ఆడియన్స్లో ఉన్న ఒక ఆరేళ్ల పాప తప్పించుకోలేకపోయింది. దాంతో ఆ పాపకు దెబ్బతగిలింది. ఆ సమయంలో కామెంటరీ చెప్తున్న మైకేల్ ఆథర్టాన్, రవిశాస్త్రి కూడా ఈ విషయాన్ని గమనించారు.
ఇంగ్లండ్ జట్టు ఫిజియోలు వెంటనే వెళ్లి ఆ పాపకు తగిలిన గాయాన్ని పరిశీలించారని ఇంగ్లండ్కు చెందిన బర్మీ ఆర్మీ ట్విట్టర్ హ్యాండిల్ వెల్లడించింది. అంతేకాదు, మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ కూడా వెళ్లి పాపను కలిశాడని తెలిపింది.
Shoutout to the @englandcricket physios yesterday 🙌
6 year-old Meera was hit by a Rohit Sharma six in the crowd and they quickly rushed round to check on her.
She was okay and even received a visit off Sharma himself later in the day!#ENGvIND pic.twitter.com/mbvOsoT6lQ
— England’s Barmy Army (@TheBarmyArmy) July 13, 2022