చింద్వారా: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తమ కుటుంబానికి చెందిన 8 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్కు చెందిన చింద్వారా జిల్లాలోని బోదల్ కచ్చార్ గ్రామంలో జరిగింది. కుటుంబసభ్యులను హత్య చేసిన వ్యక్తి మానసికంగా స్థిమితంగా లేనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి చింద్వారా కలెక్టర్, ఎస్పీ వెళ్లారు. ఈ ఘటన పట్ల పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
మంగళవారం రాత్రి కుటుంబసభ్యులపై అటాక్ చేసినట్లు ఎస్పీ ఖత్రి తెలిపారు. సోదరుడు, కోడలు, భార్యతో పాటు మరో చిన్నారిని కూడా ఆ వ్యక్తి హత్య చేశాడు. అందర్నీ హత్య చేసిన తర్వాత ఆ వ్యక్తి సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆ కుటుంబానికి చెందిన ఒక్క చిన్నారి మాత్రమే ఆ దాడిలో గాయాల వల్ల బయటపడ్డాడు. ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఏ కారణం చేత ఆ వ్యక్తి హత్యకు పాల్పడ్డాడో తెలియదు. ఆ కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.