Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టీ20 ఫార్మాట్(T20 Match)లో ఆడక దాదాపు 10 నెలలు కావొస్తోంది. దాంతో, అతడి టీ20 కెరీర్ ముగిసినట్టే అనే వార్తలు జోరందుకున్నాయి. అయితే.. హిట్మ్యాన్ మాత్రం ఆ వార్తల్ని కొట్టిపారేశాడు. ప్రస్తుతం అమెరికా పర్యటన(US Tour)లో ఉన్న అతను వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్(T20 World Cup)లో ఆడతానని హింట్ ఇచ్చాడు. అతని మాట విన్న అభిమానులను అయోమయానికి గురయ్యారు.
‘ఇక్కడకు వచ్చి, ఎంజాయ్ చేయడం కాదు.. నా రాకకు ఓ కారణం ఉంది. వచ్చే ఏడాది జూన్లో ఇక్కడే పొట్టి ప్రపంచ కప్ జరుగుతుందనే విషయం మీ అందరికి తెలుసు. ఆ మెగా టోర్నీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నా. వరల్డ్ కప్లో నేను ఆడతానేమో’ అని రోహిత్ తెలిపాడు.
Rohit Sharma talking about on T20 World Cup 2024 in USA – The Hitman! pic.twitter.com/i8m0CoQYeY
— CricketMAN2 (@ImTanujSingh) August 6, 2023
నిరుడు ఆస్ట్రేలియాలో జరిగినర పొట్టి ప్రపంచ కప్(T20 World Cup)లో టీమిండియా సెమీస్లోనే ఇంటిదారి పట్టింది. ఇంగ్లండ్పై దారుణ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత నుంచి స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ టీ20 మ్యాచ్ ఆడలేదు. సొంత గడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్తో పొట్టి సిరీస్లకు సెలెక్టర్లు వీళ్లను పక్కనబెట్టారు. హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) సారథ్యంలోని యువ భారత్ బంగ్లాదేశ్తో పాటు లంక, కివీస్పై సిరీస్ గెలిచింది. అంతేకాదు తాజాగా వెస్టిండీస్, ఆ తర్వాత జరుగబోయే ఐర్లాండ్ సిరీస్కు ప్రకటించిన జట్టులో కూడా కోహ్లీ, రోహిత లేరు.
సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన టీమిండియా
దాంతో, ఈ ఇద్దరు వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్లో ఆడడం అనుమానాస్పదమే. ఎందుకంటే..? యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఈ ఫార్మాట్లో దంచి కొడుతున్నారు. దాంతో, టాపార్డర్లో ఇక కోహ్లీ, రోహిత్ అవసరం ఉండకపోచ్చు అనిపిస్తోంది. 2024 టీ20 వరల్డ్ కప్ పోటీలకు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యం ఇస్తున్నాయి.
రోహిత్ శర్మ
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. తొలి టెస్టులో రోహిత్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఆ తర్వాత తొలి వన్డేలో ఏడే స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. అయితే.. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అతను, కోహ్లీ రెండు, మూడో వన్డేలో ఆడలేదు. వీళ్లిద్దరూ ఆసియా కప్తో జట్టుతో కలువనున్నారు. శ్రీలంక, పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగాటోర్నీ ఆగస్టు 30న షురూ కానుంది.