ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి అందరి మన్ననలు పొందిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. కేవలం 111 బంతుల్లోనే 146 పరుగులు చేసి వన్డే, టీ20 తరహా ఆటతీరుతో అందరినీ అలరించాడీ ఎడం చేతి వాటం బ్యాటర్. దీనిపై మాట్లాడుతూ.. ‘‘నేను ఒకే విధంగా ఆడకూడదని ట్రై చేస్తూ ఉంటా. దాంతో బౌలర్లు మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు’’ అని చెప్పాడు.
అలాగే ఇంగ్లండ్ వంటి పిచ్లపై, అది కూడా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు అలా వారిని డిస్టర్బ్ చేయడం చాలా ముఖ్యమన్నాడు. దాంతో సదరు బౌలర్ లైన్ అండ్ లెంగ్త్ కూడా దెబ్బతింటుందని వివరించాడు. తొలి రోజు ఆటలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన పంత్.. భారత్ తరఫున అత్యంత వేగంగా టెస్టు సెంచరీ చేసిన కీపర్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ధోనీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.