Rishabh Pant | క్రికెట్ అభిమానులకు శుభవార్త. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాట్ పట్టి మైదానంలోకి దిగాడు. గతేడాది చివరలో జరిగిన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఇటీవల బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించగా.. ప్రస్తుతం పంత్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పంత్ మైదానంలో చాలాసేపు క్రీజులో నిలబడి సాధన చేశాడు. పంత్ బ్యాటింగ్కు దిగడాన్ని చూసిన ఫ్యాన్స్ సందడి చేశారు.
బ్యాటింగ్ అనంతరం వికెట్ కీపింగ్ ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. లోకల్ మ్యాచ్లో చాలాసేపు క్రీజులో నిలబడి ఫోర్లు, సిక్సర్లు బాది అభిమానులను అలరించాడు. రోడ్డు ప్రమాదం తర్వాత కాలికి శస్త్ర చికిత్స చేసుకున్న రిషబ్ పంత్.. మూడు నెలలు మంచానికే పరిమితమయ్యాడు. ఇటీవల కోలుకున్న రిషబ్ పంత్.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ రిహాబిలిటేషన్లో ఉన్నాడు. ఇక వచ్చే ఏడాది ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్కు పూర్తిగా కోలుకొని జాతీయ జట్టులోకి వస్తాడని బీసీసీఐ భావిస్తున్నది.
Rishabh Pant’s batting practice, recovery has been excellent.
– Great news for Indian cricket. pic.twitter.com/KThpdkagDz
— Johns. (@CricCrazyJohns) August 16, 2023