INDvsAFG: స్వదేశంలో అఫ్గానిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా బుధవారం బెంగళూరుతో మూడో మ్యాచ్ ఆడనున్న భారత జట్టు చిన్నస్వామి స్టేడియంలో కసరత్తులు చేస్తోంది. ఈ సందర్భంగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్కు అనుకోని అతిథి వచ్చాడు. గాయం కారణంగా సుమారు 13 నెలలుగా క్రికెట్కు దూరంగా ఉంటున్న భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ప్రాక్టీస్ సెషన్కు వచ్చి విరాట్ కోహ్లీతో పాటు మిగిలిన భారత క్రికెటర్లతో ముచ్చటించాడు. పంత్ను భారత ఆటగాళ్లు కలిసి ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 2022 డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తున్న పంత్.. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఏడాదికాలంగా క్రికెట్కు దూరమైన విషయం తెలిసిందే.
టీమిండియా ప్రాక్టీస్ సెషన్కు వచ్చిన పంత్.. చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ, రింకూ సింగ్లతో కలిసి మాట్లాడుతున్న వీడియోను కోహ్లీ ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్న పంత్.. ఇప్పుడిప్పుడే ఫిట్నెస్ను నిరూపించుకునే పనిలో ఉన్నాడు. పంత్ కొన్నాళ్లుగా బెంగళూరులోనే ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహాబిటేషన్ సెంటర్లో ఉంటున్న విషయం విదితమే. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొదలయ్యేనాటికల్లా పంత్ పూర్తిస్థాయిలో కోలుకుని క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. ఆ దిశగానే అతడి ట్రైనింగ్ కొనసాగుతోంది.
Virat Kohli and Rishabh pant at Chinnaswamy Stadium 😍🔥 pic.twitter.com/VnjwvBOnTo
— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 16, 2024
ఇక భారత్ – అఫ్గాన్ సిరీస్ విషయానికొస్తే ఇరు జట్ల మధ్య మొహాలీ, ఇండోర్ వేదికగా ముగిసిన మ్యాచ్లలో టీమిండియా ఘన విజయాలు సాధించింది. రెండు మ్యాచ్లలోనూ ఛేదన చేసిన భారత్.. అఫ్గాన్ నిర్దేశించిన లక్ష్యాలను అలవోకగా సాధించింది. బ్యాటింగ్కు అనుకూలించే చిన్నస్వామి పిచ్ (బెంగళూరు)పైనా ఇదే జోరును కొనసాగించి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది జూన్లో వెస్టిండీస్ / అమెరికా వేదికగా జరగాల్సి ఉన్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్కు ముందు భారత్ ఆడబోయే ఆఖరి టీ20 ఇదే కావడం గమనార్హం. ఇదివరకే సిరీస్ గెలిచిన నేపథ్యంలో ఆఖరి మ్యాచ్లో భారత జట్టులో పలు మార్పులు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.