Rishabh Pant : భారత స్టార్ ఆటగాడు రిషభ్ పంత్(Rishabh Pant) ఏడాదిన్నర తర్వాత పునరాగనం చేస్తున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంత్ ఆడడం ఖాయమైంది. నేషనల్ క్రికెట్ అకాడమీ ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు బీసీసీఐ(BCCI) కూడా పచ్చజెండా ఊపడంతో తన మెరపులతో ఫ్యాన్స్ను అలరించేందుకు పంత్ సిద్ధమవుతున్నాడు. దాంతో, అభిమానులు పంత్కు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంలో ఒక అభిమాని డబ్బులు వృథా చేయకుండా.. పేదపిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టారు.
దాదాపు 100 మంది పేద పిల్లలకు ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చారు. ఆహారం అందుకున్న ఆ పిల్లల ముఖాలు నవ్వులతో వెలిగిపోయాయి. మరికొందరు పిల్లలు పునరాగమనం చేస్తున్న పంత్కు స్వాగతం అని ఇంగ్లీష్లో రాస్తున్న పోస్టర్ పట్టుకొన్నారు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
A Rishabh Pant fan distributed 100 food packets to the needy people on the occasion of Pant making the comeback.
– A lovely gesture! ❤️pic.twitter.com/XrfQqnvo3t
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 14, 2024
భారత క్రికెట్లో పంత్ ఆట స్టయిలే వేరు. దూకుడుకు మారుపేరైన అతడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డపై చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడాడు. కానీ, 2022లో కారు యాక్సిడెంట్ అతడిని ఆటకు దూరం చేసింది. సర్జరీ అనంతరం ఎన్సీఏలో కోలుకున్న పంత్.. 14 నెలల తర్వాత మళ్లీ బ్యాటు పట్టాడు. నెట్స్లో భారీ షాట్లు ఆడుతూ ఐపీఎల్కు తాను సిద్ధమే అని ప్రకటించాడు. అనుకున్నట్టుగానే బీసీసీఐ ఈ డాషింగ్ బ్యాటర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నిరుడు పంత్ సారథ్యం, మెరుపు ఇన్నింగ్స్లు లేక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కుదేలైంది. అందుకని ఈసారి అతడి విధ్వంసక ఇన్నింగ్స్లు చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరో 8 రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది. ఢిల్లీ తమ తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఢీకొననుంది.