WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) కీలక పోరులో జూలు విదిల్చింది. యూపీ వారియర్స్(UP Warriorz)ను చిత్తుగా ఓడించి మూడో విజయం ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్తో డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ ప్లేయర్ ఎక్తా బిష్త్(Ekta Bisht) అరంగేట్రం చేసింది. ఆడిన తొలి మ్యాచ్లోనే ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అరుదైన ఫీట్ సాధించింది. డబ్ల్యూపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యంత పెద్ద వయస్కురాలిగా బిష్త్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏండ్ల 25 రోజులు.
సోమవారం చిన్నస్వామి స్టేడియంలో యూపీతో మ్యాచ్కు ముందు శ్రేయాంక గాయపడింది. దాంతో, ఆమె స్థానంలో బిష్త్ బరిలోకి దిగింది. ఉత్తరప్రదేశ్లోని అల్మొరాకు చెందిన బిష్త్ 2011లో భారత జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడింది.
🗣️ Spinning her way into the Red & Gold tonight ➡️ Ekta Bisht 💫
Drop a 🫶 in the comments to show some love, 12th Man Army! 💬#PlayBold #SheIsBold #ನಮ್ಮRCB #WPL2024 #UPWvRCB pic.twitter.com/boAM8OiqgA
— Royal Challengers Bangalore (@RCBTweets) March 4, 2024
ఆమె సుదీర్ఘ ఫార్మాట్లో ఒకే మ్యాచ్ ఆడినప్పటికీ 63 వన్డేలు, 42 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది. తన స్పిన్ మాయాజాలంతో ఆమె వన్డేల్లో 98, టీ20ల్లో 53 వికెట్లు పడగొట్టింది. 2017లో పాకిస్థాన్పై విజయంలో బిష్త్ కీలక పాత్ర పోషించింది. దాయాది జట్టుపై 8జ5తో వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది.
ఎక్తా బిష్త్
అనంతరం 2022 వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లోనూ బిష్త్ మెరిసింది. నిరుడు డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ వేలంలో ఆర్సీబీ ఆమెను రూ. 30 లక్షలకు కొన్నది. అయితే.. తొలి సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడే చాన్స్ రాలేదు. రెండో సీజన్లోనూ బిష్త్ బెంచ్కే పరిమితం అవుతుందనుకన్నారంతా.
Up, up and away she goes! Hopefully, many more from the skip, tonight! ☄️#PlayBold #SheIsBold #ನಮ್ಮRCB #WPL2024 #UPWvRCB @SMrir
— Royal Challengers Bangalore (@RCBTweets) March 4, 2024
కానీ, శ్రేయాంక పాటిల్ గాయపడడంతో బిష్త్కు తొలి మ్యాచ్ ఆడే చాన్స్ దక్కింది. మ్యాచ్లో ఒకే ఒక ఓవర్ వేసిన ఆమె 10 పరుగులు సమర్పించుకుంది. ఈ మ్యాచ్లో కెప్టెన్ స్మృతి మంధానా(80), అలీసా పెర్రీ(58)లు దంచి కొట్టడంతో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో యూపీని చిత్తు చేసింది.