Mahendra Singh Dhoni | ఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్కు గుడ్ బై చెబుతాడని, ఇదే అతడి ఆఖరి సీజన్ అని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నా ఇప్పటిదాకా ఆ విషయమ్మీద అటు మహేంద్రుడు గానీ ఇటు చెన్నై యాజమాన్యం గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
మోకాలి గాయంతోనే ఐపీఎల్-17 ఆడిన ధోనీ.. శస్త్రచికిత్స నిమిత్తం త్వరలోనే లండన్కు వెళ్లనున్నాడట. సర్జరీ తర్వాతే అతడు రాబోయే సీజన్ వరకూ వేచి చూస్తాడా..? లేక ఆలోపే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా..? అన్నదానిపై స్పష్టత రానున్నట్టు సమాచారం.