Rohan Bopanna | ఢిల్లీ: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్లో భారత్ తరఫున టెన్నిస్ డబుల్స్ విభాగంలో స్టార్ ప్లేయర్ రోహన్ బోపన్నతో జట్టు కట్టేదెవరు? అన్నదానిపై ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా) మల్లగుల్లాలు పడుతోంది.
నిబంధనల ప్రకారం టెన్నిస్ ర్యాం కింగ్స్ టాప్-10లో ఉండే ఆటగాడు తనకు నచ్చిన ప్లేయర్ను ఎంపిక చేసుకునే అవకాశముంటుంది. ప్రస్తుతం నాలుగో ర్యాంకులో ఉన్న బోపన్న.. తనకు జోడీగా శ్రీరామ్ బాలాజీ, యూకీ బాంబ్రీ పేర్లను సెలక్షన్ కమిటీకి పంపినట్టు తెలుస్తోంది.