పుణె: మహారాష్ట్రలోని పుణెలో క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న ఓ చిరుత పులి (Leopard) కలకలం సృష్టిస్తున్నది. కర్ణాటకలోని జూలో జన్మించిన ఆ చిరుతను కొన్ని రోజుల క్రితం పుణె రాజీవ్ గాంధీ జూపార్క్కు తరలించారు. ఈ నేపథ్యంలో జూ వద్ద ఉన్న ఓ క్వారంటైన్ సెంటర్లో ఉంచిన అధికారులు దానిని పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో అది క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకున్నది. జూ సమీపంలో ఉన్న పొదల్లో దాక్కుంది.
విషయం తెలుసుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది చిరుత కోసం గాలింపు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. పులి ఎక్కడ నక్కి ఉందని తెలుసుకోవడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నామని అధికారులు చెప్పారు. సోమవారం ఉదయం అది తప్పించుకుందని తెలిపారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.