న్యూఢిల్లీ: కివీస్ పర్యటన నుంచి విరామం తీసుకున్న టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. వచ్చే నెల బంగ్లాదేశ్తో జరుగనున్న వన్డే సిరీస్కు తిరిగి జట్టుతో చేరనున్నారు. కాగా.. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకోని ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు, పేస్ బౌలర్ యష్ దయాల్ను జట్టు నుంచి తప్పించారు. వీరిద్దరి స్థానాల్లో ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్, పేసర్ కుల్దీప్ సేన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వచ్చే నెలలో బంగ్లాలో పర్యటించనున్న భారత్.. మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది.