హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. ప్లేట్ గ్రూప్లో భాగంగా జరిగిన పోరులో హైదరాబాద్ ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో మేఘాలయను చిత్తుచేసింది. గత మ్యాచ్ను రెండు రోజుల్లోనే ముగించిన హైదరాబాద్.. ఈసారి కూడా అదే తరహాలో రెండోసారి బ్యాటింగ్కు దిగకుండానే ప్రత్యర్థి పని పట్టింది.
తొలి ఇన్నింగ్స్లో మేఘాలయ 111 పరుగులకు ఆలౌట్ కాగా.. హైదరాబాద్ 346/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రోహిత్ రాయుడు (124 నాటౌట్) శతక్కొట్టగా.. చందన్ సహాని (52), సీవీ మిలింద్ (50) హాఫ్సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్లో మేఘాలయ 154 పరుగులకే ఆలౌటైంది.