Ranji Trophy 2024 | దేశవాళీ ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై.. విదర్భ ఎదుట 538 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్లో ముంబై బ్యాటర్లు నిలకడగా ఆడారు. ముంబై యువ సంచలనం ముషీర్ ఖాన్ (136) సెంచరీతో మెరవగా కెప్టెన్ అజింక్యా రహానే (73) ఎట్టకేలకు రాణించాడు. శ్రేయస్ అయ్యర్ (95) ఐదు పరుగుల తేడాతో శతకం కోల్పోయాడు. లోయరార్డర్ బ్యాటర్ శామ్స్ ములానీ (50 నాటౌట్) అర్థ సెంచరీ బాదడంతో 130.2 ఓవర్లలో ముంబై 418 పరుగులకు ఆలౌట్ అయింద. తొలి ఇన్నింగ్స్లో 119 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ముంబై.. విదర్భ ఎదుట 537 పరుగుల టార్గెట్ను నిలిపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ.. 2 ఓవర్లు బ్యాటింగ్ చేసి వికెట్లేమీ కోల్పోకుండా పది పరుగులు చేసింది.
ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ నెగ్గాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. భారత పిచ్లపై నాలుగు, ఐదు రోజులలో బంతి స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. విదర్భ బ్యాటింగ్ లైనప్ కూడా అంత పటిష్టంగా లేదు. ఈ పరిస్థితులలో ముంబై బౌలర్లను ఎదుర్కుని 538 పరుగులు చేయాలంటే ఆ జట్టు చెమటోడ్చాల్సిందే. రెండు రోజులు క్రీజులో నిలిచి కొండను కరిగించగలిగితే విదర్భ కొత్త చరిత్ర సృష్టించినట్టే.
Innings break!
A valuable unbeaten fifty from Shams Mulani helps Mumbai reach 418 in the second innings.
Harsh Dubey, the pick of the bowlers for Vidarbha with a fifer 👏
Scorecard ▶️ https://t.co/L6A9dXYmZA#RanjiTrophy | #MUMvVID | #Final | @IDFCFIRSTBank pic.twitter.com/14utXlCJSw
— BCCI Domestic (@BCCIdomestic) March 12, 2024
అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ముంబై.. శార్దూల్ ఠాకూర్ (75), పృథ్వీ షా (46), భూపేన్ లల్వాని (37)ల పుణ్యమా అని 224 పరుగులు చేసింది. విదర్భ తొలి ఇన్నింగ్స్లో 105 రన్స్కే వెనుదిరగడంతో ముంబైకి కీలకమైన ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఇప్పుడు ఈ మ్యాచ్ను విదర్భ డ్రా చేసుకున్నా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఫైనల్లో ముంబై గెలిచే అవాకశాలు పుష్కలంగా ఉన్నాయి.