IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. టైటిల్ స్పాన్సర్గా ‘ల్యూమినస్ పవర్ టెక్నాలజీస్’ (Luminous Power Technologies) హక్కులను పొడిగించింది. 2024 ఎడిషన్తో పాటు మరో సీజన్కు ల్యూమినస్ కంపెనీ రాజస్థాన్ టైటిల్ స్పాన్సర్గా ఉంటుందని శుక్రవారం ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో, మరో రెండు సీజన్లు రాజస్థాన్ ఆటగాళ్ల జెర్సీలు, కిట్స్పై ల్యూమినస్ లోగో కనిపించనుంది.
‘మా సిద్ధాంతాలు చాలా బలమైనవి. సోలార్ ఎనర్జీ వాడకాన్ని ప్రమోట్ చేయడం ద్వారా మేము సమాజంలో చూడాలనుకున్న మార్పు రాజస్థాన్లోని పలు వర్గాల ప్రజల జీవితాల్ని మెరుగుపరుస్తోంది’ అని రాజస్థాన్ సీఈఓ జకె లష్ మెక్క్రమ్ వెల్లడించాడు. 16వ ఎడిషన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ జట్టుతో లూయిస్ రూ. 15 కోట్లకు ఒప్పందం చేసుకుంది. ఈసారి ఆ మొత్తాన్ని 40 కోట్లకు పెంచినట్టు సమాచారం.
సంజూ శాంసన్
ఐపీఎల్ తొలి సీజన్(2008)లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రెండో ట్రోఫీ కోసం ఏండ్లుగా నిరీక్షిస్తోంది. నిరుడు సంజూ శాంసన్(Sanju Samson) సారథ్యంలోని రాజస్థాన్ ఫైనల్ చేరింది. దాంతో, ట్రోఫీ కొట్టడం పక్కా అనుకున్నారంతా. కానీ, టైటిల్ పోరులో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్(Gujart Titans) గద్దలా తన్నుకుపోయింది. ఇక 16వ సీజన్లో రాజస్థాన్ వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. దాంతో, 2024 ఎడిషన్లో సంజూ సేన ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది.