న్యూఢిల్లీ: చైనాలో ప్రస్తుతం హెచ్9ఎన్2 వైరస్ కేసులు( H9N2 Cases) ప్రబలుతున్నాయి. చిన్నారుల్లో నుమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఉత్తర చైనాలో ఆ కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. అయితే ఈ అంశంపై ఇవాళ భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. చైనాలో ఉన్న హెచ్9ఎన్1 కేసులతో భారత్కు ఎటువంటి రిస్క్ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏవియన్ ఇన్ప్లుయాంజా కేసులతో పాటు, శ్వాసకోస వ్యాధుల సంఖ్య చైనాలో పెరుగుతున్నాయి. చిన్నారుల్లోనే ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత సర్కారు ప్రకటన చేయాల్సి వచ్చింది. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
పిల్లల్లో నమోదు అవుతున్న నుమోనియా కేసులకు కొత్త తరహా ప్యాథోజన్తో లింకు లేదని చైనా వెల్లడించినట్లు డబ్ల్యూహెచ్వో ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నది. అక్టోబర్ నుంచి చైనా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు నమోదు అవుతున్నట్లు డేటా ప్రకారం తెలుస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే వ్యాధులకు సంబంధించిన మరింత డేటాను ఇవ్వాలని చైనాను కోరినట్లు డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. బీజింగ్లో కానీ, లియానింగ్లో కానీ ఎటువంటి కొత్త ప్యాథోజెన్స్ను గుర్తించ లేదని, అయితే పిల్లల్లో నుమోనియా కేసులు పెరగడానికి సాధారణ ప్యాథోజెన్లే కారణమని డబ్ల్యూహెచ్వో చెప్పింది.
.@MoHFW_INDIA is closely monitoring the outbreak of H9N2 and clusters of respiratory illness in children in China
There is a low risk to India from both the avian influenza cases reported from China as well as the clusters of respiratory illness
India is prepared for any kind… pic.twitter.com/hcIMzNTHtx
— PIB India (@PIB_India) November 24, 2023