Rahul – Maharaj : దక్షిణాఫ్రికా గడ్డపై యువకులతో నిండిన భారత జట్టు వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. నిరుడు జనవరిలో సఫారీల చేతిలో 3-0తో ఎదురైన పరాభవానికి కేఎల్ రాహుల్(KL Rahul) సేన ప్రతీకారం తీర్చుకుంది. సిరీస్ డిసైడర్ అయిన ఈమ్యాచ్ సమయంలో ‘ఆదిపురుష్'(Aadi Purush) సినిమాలోని పాపులర్ సాంగ్ ‘రామ్ సియా రామ్'(Ram Sia Ram)తో స్టేడియం హోరెత్తి పోయింది. అంతేకాదు ఈ పాట విషయమై భారత సారథి రాహుల్, దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్(Keshav Maharaj) మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది.
భారత్ నిర్దేశించిన 297 పరుగుల ఛేదనలో సఫారీ జట్టు 192 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో కేశవ్ మహారాజ్ క్రీజులోకి వచ్చాడు. అతడు బ్యాటింగ్కు వస్తుండగానే స్టేడియంలో ‘రామ్ సియా రామ్’ పాటను ప్లే చేశారు. ఈ విషయాన్ని రాహుల్ అతడితో ప్రస్తావించాడు. ‘నువ్వు బ్యాటింగ్కు వచ్చినప్పుడల్లా ఈ పాట పెడుతున్నారు. మరీ బౌలింగ్కు వచ్చినప్పుడు కూడా ఈ పాట వేస్తారా?’ అని మహారాజ్ను రాహుల్ అడిగాడు. దానికి సఫారీ స్పిన్నర్ ‘అవును’ అని నవ్వుతూ బదులిచ్చాడు. వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైక్లో రికార్డు అయింది. భారత సంతతికి చెందిన మహరాజ్ హిందూ సంప్రదాయాల్ని పక్కాగా పాటిస్తాడు. వరల్డ్ కప్ సందర్భంగా అతడు ఓం అని రాసున్న బ్యాట్తో కెమెరా కంట పడడం తెలిసిందే.
Did you hear👂 pic.twitter.com/i2AEDyIEUh
— Arya_Sinha9 (@Yobitch92321581) December 21, 2023
బొలాండ్ పార్క్లో జరిగిన మూడో వన్డేలో భారత్ 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ సంజూ శాంసన్(108 : 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత సెంచరీ బాదగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(52 : 77 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొని వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ కొట్టాడు.
సంజూ శాంసన్(108), తిలక్ వర్మ(52)
చివర్లో రింకూ సింగ్(38) వీరవిహారం చేయడంలో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. అనంతరం ఛేదనలో అర్ష్దీప్ 4 వికెట్లతో సఫారీలను దెబ్బకొట్టాడు. రెండో వన్డేలో సెంచరీ హీరో టోని జోర్జి(81) అర్ధ సెంచరీతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. దాంతో భారత్ 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.