ఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం దిశగా సాగుతోంది.రాజస్థాన్ నిర్దేశించిన 172 పరుగుల ఛేదనలో ముంబై 13 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి
111 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 35 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. క్రీజులో కుదురుకున్న డికాక్ జట్టును గెలుపు దిశగా నడిపిస్తున్నాడు. ఐపీఎల్ 2021లో అతనికిదే తొలి హాఫ్సెంచరీ. ముంబై విజయానికి ఇంకా 42 బంతుల్లో 61 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం డికాక్(55), కృనాల్ పాండ్య(14) క్రీజులో ఉన్నారు.