PV Sindhu | నింగ్బో: ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ తప్ప మిగిలిన భారత అగ్రశ్రేణి షట్లర్లు తొలిరౌండ్లోనే చేతులెత్తేశారు. మహిళల సింగిల్స్లో సింధు 18-21, 21-14, 21-19 తేడాతో మలేషియాకు చెందిన గో జిన్ వెయిని చిత్తుచేసి ప్రిక్వార్టర్స్కు అర్హత సాధించింది.
తొలి గేమ్ కోల్పోయినా తర్వాత పుంజుకున్న సింధు వరుస గేమ్స్లో ప్రత్యర్థిని మట్టికరిపించింది. పురుషుల సింగిల్స్లో ప్రణయ్..17-21, 23-21, 23-21 తేడాతో ప్రపంచ 33వ ర్యాంకర్ లు గువాంగ్ జు (చైనా)తో పోరాడి గెలిచాడు. మిగతా మ్యాచ్ల్లో శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్, లక్ష్యసేన్, త్రిసాజాలీ-గాయత్రి గోపీచంద్ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.