టోక్యో: భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు ఒలింపిక్స్లో తన విజయ పరంపరను కొనసాగిస్తున్నది. మహిళ సింగిల్స్ గ్రూప్-జేలో వరుసగా మూడు విజయాలు సాధించి క్వార్టర్స్కు దూసుకెళ్లింది. గురువారం ఉదయం డెన్మార్క్ షెట్లర్ మియా బ్లిక్ఫెల్ట్తో జరిగిన ప్రీక్వార్టర్స్లో వరుస గేమ్లలో 21-15, 21-13తో చిత్తుచేసింది. దీంతో వరుస విజయాలతో గ్రూప్-జేలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, క్వార్టర్ ఫైనల్లో గెలిస్తే కాంస్యం సాధించే అవకాశం ఉంది.