మంచిర్యాల : భీమారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద నివాసముంటున్న ఆటో డ్రైవర్ కోటి(36) ఫైనాన్సర్ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమారంలోని ఆవుడం క్రాస్ రోడ్డు సమీపంలో జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి చెందిన రవికుమార్ ఫైనాన్స్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. అతడి వద్ద ఇటీవల రూ. 20 వేలు అప్పుగా తీసుకున్నాడు.
అప్పు కట్టడంలేదంటూ శుక్రవారం సాయంత్రం కోటి వద్దనున్న ఆటోను తీసుకెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన కోటి ఇంట్లోకి వచ్చి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో మంచిర్యాలలోని ఓ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్కు తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, కోటికి భార్య సుజాత, పాప, బాబు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
భూ తగాదాలతో తండ్రీ, కొడుకుల దారుణ హత్య
కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా