Chateshwar Pujara : భారత స్టార్ ఆటగాడు ఛతేశ్వర్ పూజారా(Chateshwar Pujara) ఫామ్ అందుకున్నాడు. ఇంగ్లండ్లో జరుగుతున్న వన్డే కప్(One Day Cup)లో సస్సెక్స్(Sussex) జట్టు తరఫున ఆడుతున్న ఈ నయావాల్ సెంచరీతో మెరిశాడు. దాంతో, త్వరలోనే మళ్లీ టీమిండియాకు ఎంపికవుతానని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘నా పరిధిలో ఉన్న విషయాల్ని నేను నియంత్రించగలను. ఆడిన ప్రతి మ్యాచ్లో ఎక్కువ పరుగులు చేయాలని అనుకుంటా. ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో నిలకడగా రాణిస్తే మళ్లీ భారత జట్టులోకి వస్తాననే విషయం తెలుసు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో గేమ్పైనే దృష్టి పెట్టాను’ అని పూజారా వెల్లడించాడు.
అంతేకాదు డిసెంబర్లో జరుగనున్న దక్షిణాఫ్రికా సిరీస్(South Africa Series 2023)లోపు భారత జట్టులోకి రావాలనే పట్టుదలతో ఉన్నట్టు పూజారా చెప్పాడు. మరో రెండు మూడు నెలల తర్వాత గానీ టీమిండియా టెస్టు మ్యాచ్లు ఆడబోదు. వరల్డ్ కప్ తర్వాత డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఉంది. అయితే.. అప్పటికి ఇంకా చాలా సమయం ఉంది అని పూజారా అన్నాడు. వన్డే కప్లో నిన్న సోమర్సెట్(Somerset) జట్టుపై 113 బంతుల్లో 117 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దాంతో, సస్సెక్స్ టీమ్ 319 టార్గెట్ను 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
A trademark performance. ™@cheteshwar1 💯 pic.twitter.com/sahKTzqyO9
— Sussex Cricket (@SussexCCC) August 11, 2023
ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final 2023) నయావాల్ దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ల్లో(14, 27 పరుగులు) తక్కువకే వెనుదిరిగిన అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దాంతో, వెస్టిండీస్ పర్యటనకు సెలెక్టర్లు అతడిని వేటు వేశారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో బౌల్డ్ అయిన పూజారా
దాంతో ఒకింత షాక్కు గురైన పూజారా దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో వెస్ట్ జోన్(West Zone) జట్టు తరఫున ఆడాడు. సెంచరీతో రాణించి జట్టను ఫైనల్కు చేర్చాడు. ఇప్పుడు వన్డే కప్లో సస్సెక్స్ టీమ్ తరఫున పరుగుల వరద పారిస్తున్నాడు. అలాగే రాణిస్తే దక్షిణాఫ్రికా సిరీస్కు పూజారా ఎంపికయ్యే అవకాశం ఉంది.