ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ముంబై సారధి పృథ్వీ షా.. తన ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న సెమీఫైనల్లో తనదైన ఆటతీరుతో ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. అదే సమయంలో అతనితోపాటు ఓపెనర్గా వచ్చిన యువ ఆటగాడు యశస్వి జైస్వాల్.. తొలి పరుగు చేయడానికే 54 బంతులు తీసుకున్నాడు.
దీనిపై షా ఫన్నీ మీమ్ షేర్ చేశాడు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అవెంజర్స్’లోని ఒక సీన్తోపాటు ముంబై మ్యాచ్ స్కోర్ కార్డును చూపించాడు. ప్రస్తుతం ఈ మీమ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్లో తన ధనాధన్ ఆటతో పృథ్వీ షా.. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను గుర్తుచేశాడు. అదే సమయంలో యశస్వి జైస్వాల్ తన డిఫెన్స్తో రాహుల్ ద్రావిడ్ను గుర్తు చేశాడు.
2008లో ఆస్ట్రేలియాతో ఆడుతున్న మ్యాచ్లో తొలి పరుగు చేయడం కోసం ద్రావిడ్ 40 బంతులు తీసుకున్నాడు. తొలి పరుగు చేయగానే మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులంతా అతన్ని చీర్ చేశారు. అచ్చం అలాగే తను ఎదుర్కొన్న 54వ డెలివరీకి తొలి పరుగు చేసిన యశస్వి జైస్వాల్ను కూడా డగౌట్లోని జట్టు సభ్యులు చప్పట్లతో మెచ్చుకున్నారు. ఈ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Even opposition players were clapping for Yashasvi Jaiswal's first run 😄
📸: Disney+Hotstar#PrithviShaw #YashasviJaiswal #Mumbai #Ranji #RanjiCricket pic.twitter.com/b43GkpoQrV
— CricTracker (@Cricketracker) June 16, 2022