Japan Masters : ఆసియా క్రీడల్లో వెండి పతకంతో మెరిసిన భారత స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy), కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth), లక్ష్యసేన్(lakshya sen) మరో మెగా టోర్నీకి సిద్ధమవుతున్నారు. జపాన్ మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక మహిళల సింగిల్స్లో పీవీ సింధు(PV Sindhu) మాత్రమే బరిలోకి దిగుతోంది. రేపటి నుంచి నవంబర్ 14న జపాన్లోని కుమమొటోలో ఈ టోర్నీ షురూ కానుంది. దాంతో సోమవారం భారత షట్లర్లంతా జపాన్కు బయలుదేరారు.
ఆసియా క్రీడల్లో గాయపడిన ప్రణయ్ కోలుకొని మళ్లీ ప్రాక్టీస్ మొదలెట్టాడు. వచ్చే ఏడాది జరుగనున్న ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తుపై గురిపెట్టిన అతడు తొలి రౌండ్లో అన్సీడెడ్ లీ చెక్ యూ (హాంకాంగ్)తో తలపడనున్నాడు. ఈఏడాది తీవ్రంగా నిరాశపరుస్తున్న సింధు తొలిరౌండ్లో డెన్మార్క్కు చెందిన రెండో సీడ్ మియా బ్లిచ్ఫ్లెడ్ను ఢీకొననుంది. సాత్విక్ – చిరాగ్ ద్వయం చైనీస్ తైపీకి చెందిన ఎలూ చింగ్ యావో, యాంగ్ పొ యాన్ జోడీతో తలపడనుంది.
సాత్విక్ – చిరాగ్
మరోవైపు లక్ష్యసేన్కు క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఆంథోని సినిసుక గింటింగ్(ఇండోనేషియా)తో గట్టిపోటీ తప్పకపోవచ్చు. ప్రస్తుతం బీడబ్ల్యూఏ ర్యాకింగ్స్లో 17వ స్థానంలో ఉన్న లక్ష్యసేన్, 23వ స్థానంలో కొనసాగుతున్న శ్రీకాంత్ తమ ర్యాంక్లు మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టారు. వీళ్లతో పాటు యువ సంచలనం ప్రియాన్షు రజావత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.