హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు(Thati Venkateshwarlu) ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట (Dammapet)లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha)లో సీఎం కేసీఆర్ వెంకటేశ్వర్లతో పాటు సున్నం నాగమణి తదితర కాంగ్రెస్ నాయకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ బీఆర్ఎస్ పార్టీ విజయానికి తన వంతు బాధ్యతగా పని చేస్తానని స్పష్టం చేశారు.