సింగపూర్: భారత స్టార్ షట్లర్లు సింధు, ప్రణయ్, లక్ష్యసేన్కు సింగపూర్ ఓపెన్లో చుక్కెదురైంది. టోర్నీలో కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్ విజయం సాధించగా.. మిగిలినవాళ్లంతా ఇంటి బాటపట్టారు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-15, 21-19తో కంటాపన్ వాంగ్చెరాన్ (థాయ్లాండ్)పై, ప్రియాన్షు 21-12, 21-15తో కెంటా సునెయామా (జపాన్)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-18, 19-21, 17-21తో యామగూచి చేతిలో ఓడింది. ప్రణయ్ 15-21, 19-21తో నరోకా చేతిలో ఓడాడు.