Norway Chess : ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద (R Praggnanandhaa) బోణీ కొట్టాడు. తొలి పోరులోనే ఫ్రెంచ్ ఆటగాడు అలిరెజా ఫిరౌజా(Alireza Firouzja)పై గెలుపొందాడు. మంగళవారం జరిగిన మ్యాచ్లో తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద ఆరంభ నుంచి దూకుడు కనబరిచాడు.
కేవలం 38 ఎత్తుల్లోనే ప్రజ్ఞానంద ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఫిరౌజాపై భారత గ్రాండ్మాస్టర్కు ఇదే మొదటి విజయం కావడం విశేషం. ఈ మధ్యే వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాకిచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
6 male & 6 female players, 6 boards, double round-robin format: each participant plays two games against every other player, one with white pieces and one with black.
The tournament kicks off on the 27th at 17:00 CEST and runs until June 7th, with free days on May 31st and June… pic.twitter.com/YzVIOPMUqG
— Norway Chess (@NorwayChess) May 27, 2024
నార్వే చెస్ టోర్నీలో స్థానిక ఆటగాడు కార్ల్సన్ వరల్డ్ చాంపియన్ డింగ్ లీరెన్తో మ్యాచ్ డ్రా చేసుకున్నాడు. అమెరికా గ్రాండ్ మాస్టర్ హిక నకమురా(Hika Nakamura) తోటి అమెరికన్ ఫాబియానో కరౌనపై విజయం సాధించాడు. తొలి రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, కార్ల్సన్, నకమురాలు 1.5 పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ టోర్నీలో జరుగుతున్న పురుషుల, మహిళల క్లాసికల్ గేమ్స్ డ్రాగా ముగిశాయి. దాంతో, విజేతలను నిర్ణయించేందుకు ఆరో అర్మగెడ్డన్ మ్యాచ్లు నిర్వహించనున్నారు.